మళయాలంలో ఘన విజయం సాధించిన ?ప్రేమమ్? అనే సినిమాతో సంచలనంగా మారిపోయిన హీరోయిన్ సాయి పల్లవి, ఆ తర్వాత మణిరత్నం సినిమాలో అవకాశం కొట్టేయడంతో మరింత పాపులర్ అయిన విషయం తెలిసిందే. ?ఓకే బంగారం? సినిమాతో తానేంటో మళ్ళీ నిరూపించుకున్న మణిరత్నం తాజాగా హీరో కార్తీతో ఓ సినిమా ప్లాన్ చేశారు. కశ్మీర్ నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథకు సాయి పల్లవిని హీరోయిన్గా ఎంపిక చేశారు.
ఇక త్వరలోనే సినిమా సెట్స్పైకి కూడా వెళుతుందనగా సడెన్గా సాయి పల్లవి ఈ సినిమాలో నటించడం లేదన్న సమాచారం అందుతోంది. ఇక ఈ విషయమై ఇంకా అధికారికంగా ప్రకటనేదీ రాకున్నా త్వరలోనే ఈ విషయమై ఓ క్లారిటీ వస్తుందని తెలుస్తోంది. ఇదే పాత్రకు కొంచెం వయసు ఎక్కువ ఉన్న హీరోయిన్ ఉంటే బాగుంటుందని మణిరత్నం సాయి పల్లవిని కాకుండా మరో హీరోయిన్ను సంప్రదిస్తున్నారని సమాచారం. మణిరత్నం తన సొంత బ్యానర్పై నిర్మిస్తోన్న ఈ సినిమాకు ఏ.ఆర్.రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నారు.