పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు తమ హీరోను తెరపై ఎప్పుడెప్పుడు చూస్తామా? అని ఎదురుచూస్తోన్న చూపులకు మరికొద్ది గంటల్లో తెరపడిపోనుంది. ఈ అర్థరాత్రి నుంచే స్పెషల్ షోస్తో ?సర్దార్ గబ్బర్ సింగ్? సందడి ప్రపంచవ్యాప్తంగా మొదలైపోతుండగా, రేపు పూర్తి స్థాయిలో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ఇక ప్రస్తుతం టాలీవుడ్లో క్రేజీ సినిమాల్లో మొదటి స్థానం సంపాదించుకున్న ఈ సినిమాను ఎలాగైనా రిలీజ్ రోజే చూసేయాలని అభిమానులు ఆశ పడుతూన్న నేపథ్యంలో థియేటర్ యాజమాన్యాలు టికెట్ ధరలు పెంచే ఆలోచన చేయడం గురించి ప్రస్తావించాలి.
ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో పలు సింగిల్ స్క్రీన్స్లో ?సర్దార్ గబ్బర్ సింగ్? టికెట్లను సుమారు 20రూపాయల మేర పెంచుకునేందుకు థియేటర్ యాజమాన్యాలు అనుమతి తెచ్చుకున్నాయి. ఇక ఈ ప్రాంతంలో రేపట్నుంచి పెరిగిన టికెట్ ధర అమల్లోకి వస్తుంది. ఇక ఇదే పంథాలో మరిన్ని ప్రాంతాల్లో టికెట్ ధరలను పెంచుకునే దిశగా థియేటర్ యాజమాన్యాలు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ?పవర్? ఫేం బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన సర్దార్ సినిమాను శరత్ మరార్ నిర్మించారు.