వెరీ రేర్ గా ట్వీట్లు వేస్తాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ముఖ్యంగా మనోడు తన సినిమాలపై ఎక్కువగా ట్వీటుతుంటాడు. అయితే ఎప్పుడైనా ఏదైనా విషయంపై విడిగా ట్వీటేశాడంటే మాత్రం.. అది కూడా ఇతర సినిమాల గురించే అయ్యుంటుంది. కాని తొలిసారి ఒక సోషల్ టాపిక్ ను టచ్ చేస్తూ జల్లికట్టుపై స్పందించాడు. ఆ విషయం మనకు తెలసిందే.
అయితే మహేష్ వేసిన ఆ ట్వీట్లపై రకరకాలు సెటైర్లు కూడా పడుతున్నాయి. మనోడికి జల్లికట్టుపై ఇంతగా అభిమానం ఏంటా అని ఆరా తీసేస్తున్నారు నెటిజన్లు. మరికొందరైతే.. ఇంకొన్ని అడుగులు ముందుకేసి.. మురుగదాస్ తో చేస్తున్న తమిళ-తెలుగు బైలింగ్యువల్ మూవీ ప్రచారం కోసం.. జల్లికట్టును ఉపయోగించుకుంటున్నాడని విమర్శిస్తున్నారు. హఠాత్తుగా తమిళుల పోరాటం మహేష్ కు అందుకే గుర్తుకొచ్చిందన్నది వారి వాదన. అసలు ఒక టాలీవుడ్ స్టార్ హీరోగా.. ఏపీకి స్పెషల్ స్టేటస్ కోసం జనాలు ఆందోళన చేస్తే.. దానికి ఎప్పుడైనా మద్దతు పలికావా మహేషూ అంటూ అడుగుతున్నవారు కూడా ఉన్నారు. ఇప్పటికే సూర్య కూడా ఇలాంటి విమర్శలనే ఎదుర్కోవాల్సి వచ్చింది.
ఇకపోతే పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు జల్లికట్టు గురించి కాస్త లాజికల్ గా ఎనలైటికల్ గా స్పందించిన దరిమిళా.. మహేష్ ట్వీట్లను తప్పుగా అర్దం చేసుకోవాల్సిన అవసరం లేదేమో.