బాహుబలి మొదటి భాగం విడుదలయ్యాక దాదాపు రెండేళ్ల పాటు జనాలు ఎంతో ఆసక్తిగా బాహుబలి2 కోసం ఎదురుచూశారు. దేశంలోని ప్రతీ సినిమా ప్రేక్షకుడిలోను బాహుబలి2 పై ఆసక్తి కనిపించింది. అది ఎంత స్థాయిలో ఉందో ఇప్పుడు కలెక్షన్స్ చూస్తే అర్ధమవుతుంది. ఈ అంకెలు భారతీయ సినిమా స్థాయిని ప్రపంచానికి తెలియచేస్తున్నాయి.
సినీ రంగంలోని దిగ్గజాలు అందరి నుంచి బాహబలి2కి.. టీంకి ప్రశంసలు వస్తున్నాయి. ప్రస్తుతం 450 కోట్ల రూపాయలతో దేశంలోనే అత్యంత కాస్ట్లీ మూవీగా రోబో సీక్వెల్.. 2.0 టీం బాహుబలి2 సాధించిన ఘనవిజయంపై రియాక్ట్ అయింది. సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ చిత్రాన్ని మాస్టర్ పీస్ అనేశారు. 'బాహుబలి2.. భారతీయ సినీ రంగం గర్వించదగ్గ సినిమా. ఆ భగవంతుడి అపురూపమైన కుమారుడు అయిన ఎస్ ఎస్ రాజమౌళి.. అతని టీంకి నా సెల్యూట్.. ఇదో మాస్టర్ పీస్ అన్నారు రజినీకాంత్.
2.0 దర్శకుడు కూడా బాహుబలి2 విజయాన్ని పొగడ్తల్లో ముంచెత్తాడు. ఇప్పుడే బాహుబలి2ని చూశాను. భారతీయ సినిమా గర్వించదగ్గ మూవీ.