తమిళ స్టార్ హీరో అజిత్ పక్కన నటించే అవకాశం శ్రుతి హాసన్ సొంతమైంది. 'వీరం' ఫేం శివ దర్శకత్వంలో అజిత్ హీరోగా ఏ.ఎం.రత్నం ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో కథానాయికగా శ్రుతి హాసన్ ని తాజాగా ఎంపిక చేసినట్టు కోలీవుడ్ సమాచారం. ఈ ఆఫర్ కూడా ఆమెకు పెద్ద కాంపిటీషన్ లో వచ్చింది. ఇందులో అవకాశం కోసం తమన్నా బాగా ట్రై చేసింది. ఆ తర్వాత సమంతా కూడా ప్రయత్నాలు చేసింది. అయితే, అజిత్ మాత్రం శ్రుతిని రికమెండ్ చేశాడట. దీంతో ఈ ప్రాజక్టులోకి ఈ ముద్దుగుమ్మ వచ్చినట్టు సమాచారం. ఇప్పటికే హిందీ, తెలుగు, తమిళ సినిమాల్లో శ్రుతి బిజీగా వున్న విషయం మనకు తెలిసిందే!
ajith, shrutihasan, amratnam, kollywood, news,