సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నటుడు సుధీర్ బాబు పరిశ్రమకు వచ్చి ఈరోజుటితో 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్బంగా అయన తనను ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పారు. శివ మనసులో శృతి చిత్రంతో హీరోగా పరిచయమైన సుధీర్ బాబు ప్రేమ కథా చిత్రం, భలే భలే మగాడివోయ్, కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ? వంటి హిట్ చిత్రాల్లో నటించాడు.
తను పరిశ్రమకు వచ్చి 5 ఏళ్ళు గడిచినా ఇంకా తన నుండి బెస్ట్ అవుట్ కామ్ రావాల్సి ఉందని తాను అనుకుంటున్నట్టు సుధీర్ బాబు ట్విట్టర్ ద్వారా తెలిపారు. గతేడాది బాఘీ చిత్రంతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఆయన ప్రస్తుతం సందీప్ కిషన్, ఆది వంటి జీరోలతో ఒక మల్టీ స్టారర్ చిత్రాన్ని, రచయిత నుండి దర్శకుడిగా మారిన హర్షవర్ధన్ దర్శకత్వంలో ఒక సినిమాని చేయనున్నాడు.