నటుడు సూర్య శనివారం తన పుట్టిన రోజును నిడారంబరంగా జరుపుకున్నారు.ఉదయం తల్లిదండ్రులు శివకుమార్,లక్ష్మీఅమ్మాళ్ ఆశీర్వాదం పొంది భార్య జ్యోతిక,పిల్లలు,కుటుంబ సభ్యులతో పుట్టిన రోజు వేడుకను నిడారంబరంగా జరుపుకున్నారు. కాగా చిత్రపరిశ్రమకు చెందిన పలువురు ఫోన్ల ద్వారా సూర్యకు శుభాకాంక్షలు తెలిపారు.
అభిమానులతో సూర్య రెండేళ్లుగా షూటంగ్ల కారణంగా ఇతర ప్రాంతాలలో ఉండటం వల్ల అభిమానులను కలుసుకోలేకపోయిన సూర్య ఇప్పుడు ఎస్-3 చిత్ర షూటింగ్ చెన్నైలోనే జరుగుతుండటంతో తన పుట్టిన రోజు సందర్భంగా వారిని కలుసుకోవాలనుకున్నారు. దీంతో శుక్రవారం సాయంత్రం స్థానిక వానగరం లోగల కల్యాణమండపంలో అభిమానులను కలుసుకునే ఏర్పాట్లు చేశారు.దీంతో వేలాదిమంది అభిమానులు ఆయన్ని కలుసుకునే అవకాశం కలిగింది.సూర్య అభిమానులతో సుదీర్గ సమయం ముచ్చటించారు.వారు చేస్తున్న సేవాకార్యక్రమాలు ప్రశంసించారు.
అనంతరం సూర్య వారందరికి విందు ఏర్పాటు చేసి వారితో కలిసి భోంచేశారు.దీంతో అభిమానగణం ఆనందానికి హద్దులేకుండా పోయింది. కాగా సూర్య పుట్టిన రోజు సందర్భంగా పలు ప్రాంతాల్లో ఆయన అభిమానులు పూజలు,అన్నదానాలు,రక్తదానాలు నిర్వహించారు.ఎగ్మూర్లోని ప్రభుత్వ పిల్లల ఆస్పత్రిలో రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.గుమ్మిడిపూండి,టీ.నగర్,తిరుత్తణి తదితర ప్రాంతాల్లో అభిమానుల పూజా,రక్తదాన కార్యక్రమాలు నిర్వహించారు.