పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న 'టెంపర్' చిత్రానికి కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మొదట్లో ప్రకటించిన ప్రకారం జనవరి 9న ఈ సినిమా రిలీజ్ కావలసి వుంది. అయితే,ఎన్టీఆర్ సోదరుడు జానకిరామ్ అకాలమరణం చెందడంతో అప్సెట్ అయిన ఎన్టీఆర్ షూటింగును కొన్నాళ్ల పాటు వాయిదా వేసుకున్నాడు. దాంతో, ఇప్పుడు కొత్తగా ఫిబ్రవరి 5న చిత్రాన్ని రిలీజ్ చేయాలని నిర్ణయించినట్టు చెబుతున్నారు. రెండు మూడు రోజుల్లో షూటింగును ప్రారంభించి బ్యాలెన్స్ వర్క్ ను పూర్తి చేస్తారు. ఎన్టీఆర్ సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని బండ్ల గణేష్ నిర్మిస్తున్నాడు.
ntr, purijagannadh, newdialoguedelivery, bandlaganesh, feb5th,