హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన తన సోషల్ మీడియాలో చేసిన పోస్టు హాట్ టాపిక్ అయింది. అపోలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన మొక్కలు నాటే కార్యక్రమంలో రామ్ చరణ్ పాల్గొనప్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోను ఉపాసన అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఈ ఫోటోలో రామ్ చరణ్ తో పాటు ఉపాసన తాత ప్రతాప్ సి.రెడ్డి కూడా ఉన్నారు. నా జీవితంలో ఇద్దరు వ్యక్తులు చాలా స్పెషల్. వారిలో ఒకరు మా తాత...మరొకరు రామ్ చరణ్ అని ఉపాసన చెప్పుకొచ్చారు. నా జీవితంలో వీరిద్దరి తర్వాతే ఎవరైనా అని ఉపాసన స్పష్టం చేసారు. రామ్ చరణ్, ఉపానసన మధ్య రిలేషన్ షిప్ ఎంత బాగుటుంతో ఉపాసన సోషల్ మీడియా చెక్ చేస్తే అర్థమవుతుంది. అందులో ఎక్కువ శాతం చరణ్ గురించి పోస్టులే ఉంటాయి. అన్నట్లు రామ్ చరణ్ ను ఉపాసన ముద్దుగా 'మిస్టర్ సి' అని పిలుస్తుంది.