Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-Nov-2016 11:33:55
facebook Twitter Googleplus
Photo

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో త్రివిక్రమ్ మూవీ ఖాయం అవడమే కాదు.. రీసెంట్ గా ముహూర్తం షాట్ కూడా పిక్చరైజ్ చేసేశారు. డిసెంబర్ నుంచి షూటింగ్ కూడా స్టార్ట్ చేస్తామనే అనౌన్స్ మెంట్ కూడా వచ్చేసింది. అయితే.. ఈ లోపుగానే హీరోయిన్స్ తో పాటు ఇతర నటీనటులను కూడా ఫైనలైజ్ చేయాల్సి ఉంది. పవన్ కి జోడీగా ఇద్దరు ముద్దుగుమ్మలు నటించనున్నారని తెలుస్తోంది.

పవన్-త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో రానున్న మూడో చిత్రం ఇది. గతంలో జల్సా.. అత్తారింటికి దారేది చిత్రాలు రాగా.. ఈ రెండు సినిమాల్లోనూ ఇద్దరేసి చొప్పున హీరోయిన్స్ ఉంటారు. జల్సాలో ఇలియానా.. పార్వతీ మెల్టన్ ను పవర్ స్టార్ తో రొమాన్స్ చేయగా.. అత్తారింటికి దారేదిలో సమంత-ప్రణీతా సుభాష్ లు పవన్ తో ఆడిపాడారు. ఇప్పుడు ముచ్చటగా పవన్-త్రివిక్రమ్ ల కాంబినేషన్లో వస్తున్న మూడో మూవీలో కూడా ఇద్దరు హీరోయిన్స్ కనిపించనున్నారు.

ఈ చిత్రానికి 'దేవుడే దిగివచ్చినా' అనే టైటిల్ అనుకుంటున్నట్లు వార్తలు వచ్చినా.. టైటిల్ వరకూ ఇంకా ఆలోచించలేదంటూ నిర్మాత నుంచి క్లారిటీ వచ్చేసింది. 85 కోట్ల రూపాయలతో తెరకెక్కనున్న ఈ చిత్రం.. ఇప్పటికే ట్రేడ్ వర్గాల్లో ఆసక్తికరంగా మారిపోయింది.

,  ,  ,  ,  ,  ,