పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో త్రివిక్రమ్ మూవీ ఖాయం అవడమే కాదు.. రీసెంట్ గా ముహూర్తం షాట్ కూడా పిక్చరైజ్ చేసేశారు. డిసెంబర్ నుంచి షూటింగ్ కూడా స్టార్ట్ చేస్తామనే అనౌన్స్ మెంట్ కూడా వచ్చేసింది. అయితే.. ఈ లోపుగానే హీరోయిన్స్ తో పాటు ఇతర నటీనటులను కూడా ఫైనలైజ్ చేయాల్సి ఉంది. పవన్ కి జోడీగా ఇద్దరు ముద్దుగుమ్మలు నటించనున్నారని తెలుస్తోంది.
పవన్-త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో రానున్న మూడో చిత్రం ఇది. గతంలో జల్సా.. అత్తారింటికి దారేది చిత్రాలు రాగా.. ఈ రెండు సినిమాల్లోనూ ఇద్దరేసి చొప్పున హీరోయిన్స్ ఉంటారు. జల్సాలో ఇలియానా.. పార్వతీ మెల్టన్ ను పవర్ స్టార్ తో రొమాన్స్ చేయగా.. అత్తారింటికి దారేదిలో సమంత-ప్రణీతా సుభాష్ లు పవన్ తో ఆడిపాడారు. ఇప్పుడు ముచ్చటగా పవన్-త్రివిక్రమ్ ల కాంబినేషన్లో వస్తున్న మూడో మూవీలో కూడా ఇద్దరు హీరోయిన్స్ కనిపించనున్నారు.
ఈ చిత్రానికి 'దేవుడే దిగివచ్చినా' అనే టైటిల్ అనుకుంటున్నట్లు వార్తలు వచ్చినా.. టైటిల్ వరకూ ఇంకా ఆలోచించలేదంటూ నిర్మాత నుంచి క్లారిటీ వచ్చేసింది. 85 కోట్ల రూపాయలతో తెరకెక్కనున్న ఈ చిత్రం.. ఇప్పటికే ట్రేడ్ వర్గాల్లో ఆసక్తికరంగా మారిపోయింది.