అల్లు శిరీష్ నిర్మాత ఆల్లు అరవింద్ కొడుకుగానే కాక గీతా ఆర్ట్స్ సంస్థ కో-ప్రొడ్యూసర్ గా, సౌత్ స్కోప్ మాసపత్రిక ఎడిటర్ గా కూడా మంచి పేరు ఉంది. తన అల్లు అర్జున్ ప్రభావంతో నటనపై మక్కువతో కే. రాధామోహన్ దర్శకత్వం వహించిన ?గౌరవం? చిత్రంతో తెరంగేట్రం చేసాడు. ప్రస్తుతం అల్లు శిరీష్ ?శ్రీరస్తు?శుభమస్తు? సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. ఈ సినిమా అల్లు అరవింద్ నిర్మిస్తుండగా పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు.
అల్లు శిరీష్ ఇప్పుడు మరో సినిమాలో నటించడానికి సంసిద్ధం అవుతున్నాడు. ఇంకా పేరు పెట్టని సినిమా రేపు ప్రారంభం అవుతున్నట్లు అల్లు శిరీష్ తెలిపాడు. ఈ సినిమాకి నూతన దర్శకుడు ఎంవిఎన్ రెడ్డి (వేణు) దర్శకత్వం వహిస్తుండగా శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్ పతాకం పై శైలేంద్ర బాబు ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జులై నుంచి మొదలవుతుంది. త్వరలో మిగతా వివరాలు తెలుస్తాయి.