మామూలుగా ఆయా చిత్రాల హీరోలు, హీరోయిన్లు, దర్శకులు, ఇతర నటీనటులు సినిమా రిలీజయ్యాక ప్రమోషన్ లో భాగంగా టూర్ చేస్తుంటారు. ఈ టూర్లలో నేరుగా ప్రేక్షకులను కలసి వారి స్పందన తెలుసుకుంటూ వుంటారు. అయితే, అల్లరి నరేష్ హీరోగా మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందిన 'బందిపోటు' చిత్రం యూనిట్ మాత్రం ఈ విషయంలో కాస్త భిన్నంగా ఆలోచించింది. ఈ ప్రమోషన్లో భాగంగా సినిమా విడుదలకు ముందే (సినిమా ఈ నెల 20న రిలీజవుతోంది) యూనిట్ ఆంధ్రా టూర్ చేస్తోంది. ఈ నెల 14న రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నంలలో ప్రేక్షకులను కలుస్తారు. మర్నాడు 15న గుంటూరు, విజయవాడ పట్టణాల్లో పర్యటించి, ప్రేక్షకులను స్వయంగా మీట్ అవుతారు.
allarinaresh, bandipotu, tollywood, news, release,