డైనమైట్ వంటి యాక్షన్ మూవీలో నటించిన తర్వాత ?ఈడో రకం ఆడో రకం? అనే రొమాంటిక్ కామెడీ మూవీలో మంచు విష్ణు నటించారు. ఇప్పుడు వీటికి భిన్నంగా ఉండే చిత్రాన్ని అంగీకరించారు. హోమ్ బేనర్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై ఈ చిత్రం రూపొందనుంది.
విశేషం ఏంటంటే... ఇందులో మోహన్బాబు ఒక ముఖ్య పాత్ర పోషించనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తెలిపారు. కాగా, రెండో కుమారుడు మనోజ్ హీరోగా హోమ్ బేనర్ లక్ష్మీప్రసన్న పిక్చర్స్ పతాకంపై వచ్చే ఏడాది ఓ చిత్రం నిర్మించబోతున్నాననీ, అందులో కూడా నటించబోతున్నాననీ మోహన్బాబు చెప్పారు.