హైదరాబాద్: సూపర్స్టార్ రజినీకాంత్ ?కబాలి? చిత్రం రోజుకో విశేషంతో వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఈ చిత్రం కేరళకు చెందిన ముత్తూట్ ఫైనాన్స్ కార్పొరేషన్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. రజినీకాంత్ బొమ్మను వెండి నాణేలపై ముద్రించి వాటిని దేశవ్యాప్తంగా ఉన్న ముత్తూట్ ఫైనాన్స్ బ్రాంచీల ద్వారా సరఫరా చేయడానికి ఆ సంస్థఒప్పందం కుదుర్చుకుందట. చిత్ర బృందం సోషల్మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలుపుతూ.. ?కబాలి? నాణేలను విడుదల చేసిన కార్యక్రమంలో దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ?ఈ వెండి నాణేలు 5 గ్రాములు(రూ. 350), 10 గ్రాములు(రూ. 700), 20 గ్రాములు(రూ. 1400) చొప్పున లభిస్తాయి. శుక్రవారం నుంచి ఈ నాణేలను బుక్ చేసుకోవచ్చు, కానీ చిత్రం విడుదల తర్వాతే ఇవి అందుతాయి? అని ముత్తూట్ అధికారి కెయూర్ షా తెలిపినట్లు సమాచారం.
పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కలైపులి ఎస్ థను నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రంలో రజినీకాంత్ సరసన రాధికాఆప్టే నటించారు. ఈ నెల 22న ?కబాలి? ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే.