రామ్ చరణ్ ప్రస్తుతం తని ఒరుపన్ రీమేక్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. దీన్ని ఆగస్ట్ - సెప్టెంబర్ నాటికి విడుదల చేసేలా ప్లాన్ చేసుకున్న రామ్ చరణ్.. తన మరుసటి చిత్రంపై కూడా ఓ క్లారిటీకి వచ్చేశాడు.
తని ఒరువన్ రీమేక్ తర్వాత.. సుకుమార్ డైరెక్షన్ లో మూవీ స్టార్ట్ చేయనున్నాడు చరణ్. ఓ రొమాంటిక్ ఎంటర్టెయినర్ ని తెరకెక్కించనున్నాడట సుకుమార్. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ ఫైనల్ స్టేజ్ కి వచ్చిన ఈ ప్రాజెక్ట్ ని.. వీలైనంత త్వరగా స్టార్ట్ చేసేయాలని భావిస్తున్నాడు మెగాస్టార్ తనయుడు. ఇప్పటి ప్లానింగ్ ప్రకారం జూలైలో సెట్స్ మీదకు వెళ్లనున్నారట.
జూలైలో సినిమాని స్టార్ట్ చేసి డిసెంబర్ చివరకు కంప్లీట్ చేసేసి.. సంక్రాంతికి విడుదల చేయాలన్నది రామ్ చరణ్ - సుకుమార్ ల ఆలోచన. ఈ ఇద్దరూ గతంలో పొంగల్ పండగకి మంచి హిట్స్ కొట్టారు. దీంతో పాటు.. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ఇతర సినిమాల షెడ్యూల్స్ ప్రకారం సంక్రాంతికి పెద్ద సినిమా ఏదీ వచ్చే అవకాశం లేదని భావిస్తున్నారట. ఇప్పటివరకూ అలాంటి అనౌన్స్ మెంట్ కూడా ఏదీ రాలేదు. అందుకే చెర్రీ సంక్రాంతికి ఫిక్స్ అయ్యాడని తెలుస్తోంది.