మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నితిన్ సమంత జంటగా నటించిన అ..ఆ.. విడుదలకు మరికొన్ని గంటల సమయమే ఉంది. తెల్లారితే చాలు థియేటర్లలో సందడి చేసేందుకు సినిమా సిద్ధమైంది. విడుదల ముందు రోజు కూడా అ..ఆ..కు అంతంతమాత్రమే పబ్లిసిటీ జరుగుతోంది. దర్శకుడు త్రివిక్రమ్ అయితే.. ఇప్పుటివరకూ అసలు సినిమా గురించి నోరు మెదపలేదు. మిక్కీ జే మేయర్ సినిమాటోగ్రాఫర్ నటరాజ్ లాంటి వాళ్లనైతే.. పక్కాగా మేకింగ్ వీడియోలకే పరిమితం చేసేశారు.
అంతో ఇంతో ప్రచారం చేస్తున్న హీరో హీరోయిన్స్ కూడా.. మంచి సినిమా చూడండి.. సింప్లీ సూపర్బ్ లాంటి చిన్న చిన్న మాటలు తప్ప మరేం చెప్పడం లేదు. మూవీ పబ్లిసిటీ ని ఇంత లో లెవెల్ లో చేస్తుండడంతో.. ఇప్పటికే మూవై అంచనాలు బాగా తగ్గిపోయాయని ఇండస్ట్రీ జనాలు అనుకుంటున్నారు. నిజానికి.. త్రివిక్రమ్ ఐడియా ఇదే అంటే ఆశ్చర్యం వేయకమానదు. థియేటర్లకు వచ్చేవారు ఏ మాత్రం అంచనాలు పెట్టుకోకుండా.. ప్లెయిన్ మైండ్ తో వస్తే.. వారిని సంపూర్తిగా మెప్పించవచ్చని మాంత్రికుడు ప్లాన్ చేశాడట. తన సినిమాలోని కంటెంట్ తప్ప తను మాట్లాడకూడదని భావిస్తున్నాడట.
మూవీకి మంచి టాక్ వచ్చాక.. అప్పుడు ప్రమోషన్ యాక్టివిటీస్ ని ఓ రేంజ్ లో చేస్తారని తెలుస్తోంది. సర్దార్ గబ్బర్ సింగ్ - బ్రహ్మోత్సవంలకు భారీ పబ్లిసిటీ కారణంగా పెరిగిన అంచనాలు.. చివరకు నెగిటివ్ రిజల్ట్ కు కారణమయ్యాయి. అందుకే ఇప్పుడు నెగిటివ్ పబ్లిసిటీతో పాజిటివ్ టాక్ తెచ్చుకోవాలన్నది త్రివిక్రమ్ లాజిక్. చూస్తుంటే.. ఇదే నిజమయ్యేట్లుంది కూడా.